మరింత పని చేయండి: కలెక్టర్లతో సిఎం
ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూస్తే ఇంకా మంచి ఫలితాలు రావాల్సి ఉండిందని, అలా రాకపోవడానికి ఇంకా ప్రభుత్వం బాగా పని చేయాలని ప్రజలు ఆశించారా, లేకుంటే ప్రజల ఆకాంక్షలు ఇంకా ఎక్కువగా ఉన్నాయా అనే విషయాన్ని ఆలోచించాల్సి ఉందని ఆయన అన్నారు. పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని ఆయన జిల్లా కలెక్టర్లకు సూచించారు. ప్రతిపక్షాలు ఎక్కడ లేని వాగ్దానాలు చేసినా ప్రజలు నమ్మలేదని, తమను నమ్మారని, ఇందుకు తమపై ఉన్న విశ్వసనీయతే కారణమని ఆయన అన్నారు. ఈ స్థితిలో మనం పునరంకితం కావాలని ఆయన అన్నారు.
ఎన్నికల్లో కొత్త వాగ్దానాలు చేయకపోయినప్పటికీ తమను ప్రజలు గెలిపించారని, తాము సుపరిపాలన అందించడం వల్లనే అది సాధ్యమైందని ఆయన అన్నారు. ఈ స్థితిలో మరింత పారదర్శకంగా పాలిస్తామని ఆయన చెప్పారు. ఎక్కడైనా లోపాలు ఉంటే సరిదిద్దుకుంటామని ఆయన చెప్పారు. సమస్యల పరిష్కారాని వచ్చే ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని, వారి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆయన కలెక్టర్లకు సూచించారు. గ్రామీణ మంచినీటి సమస్యను పరిష్కరించాలని ఆయన సూచించారు.