హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరింత పని చేయండి: కలెక్టర్లతో సిఎం

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్‌: ప్రజల సమస్యలను పరిష్కరించడానికి మరింత పని చేయాలని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి జిల్లా కలెక్టర్లకు సూచించారు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయన శుక్రవారం ఉదయం ప్రసంగించారు. గత ఐదేళ్లు కలెక్టర్లు బాగా పని చేశారని, అయితే మరింత బాగా చేయడం అవసరమని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం అందిస్తున్న సేవల వల్ల ప్రజల్లో తమ విశ్వసనీయత పెరిగిందని, దాని వల్లనే తమకు తిరిగి అధికారం ఇచ్చారని, తాము విశ్వసనీయత పొందడంలో అధికారుల పాత్ర కూడా ఉందని ఆయన అన్నారు.

ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూస్తే ఇంకా మంచి ఫలితాలు రావాల్సి ఉండిందని, అలా రాకపోవడానికి ఇంకా ప్రభుత్వం బాగా పని చేయాలని ప్రజలు ఆశించారా, లేకుంటే ప్రజల ఆకాంక్షలు ఇంకా ఎక్కువగా ఉన్నాయా అనే విషయాన్ని ఆలోచించాల్సి ఉందని ఆయన అన్నారు. పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని ఆయన జిల్లా కలెక్టర్లకు సూచించారు. ప్రతిపక్షాలు ఎక్కడ లేని వాగ్దానాలు చేసినా ప్రజలు నమ్మలేదని, తమను నమ్మారని, ఇందుకు తమపై ఉన్న విశ్వసనీయతే కారణమని ఆయన అన్నారు. ఈ స్థితిలో మనం పునరంకితం కావాలని ఆయన అన్నారు.

ఎన్నికల్లో కొత్త వాగ్దానాలు చేయకపోయినప్పటికీ తమను ప్రజలు గెలిపించారని, తాము సుపరిపాలన అందించడం వల్లనే అది సాధ్యమైందని ఆయన అన్నారు. ఈ స్థితిలో మరింత పారదర్శకంగా పాలిస్తామని ఆయన చెప్పారు. ఎక్కడైనా లోపాలు ఉంటే సరిదిద్దుకుంటామని ఆయన చెప్పారు. సమస్యల పరిష్కారాని వచ్చే ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని, వారి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆయన కలెక్టర్లకు సూచించారు. గ్రామీణ మంచినీటి సమస్యను పరిష్కరించాలని ఆయన సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X