హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెవిలో పువ్వు పెట్టుకున్నారా: రోశయ్య

By Staff
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టినప్పుడు అప్పుడు మంత్రిగా పని చేసిన తెలుగుదేశం నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి చెవిలో పువ్వు పెట్టుకున్నారా అని ఆర్థిక మంత్రి కె. రోశయ్య ప్రశ్నించారు. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపని కాంగ్రెసు శాసనభ్యులు బాబ్లీలో దూకాలని నాగం జనార్దన్ రెడ్డి అనడంపై ఆయన శనివారం మీడియా ప్రతినిధుల వద్ద తీవ్రంగా ప్రతిస్పందించారు. దూకితే ప్రాజెక్టును అపుతారంటే తమకేమీ అభ్యంతరం లేదని ఆయన అన్నారు.

ప్రాజెక్టు నిర్మాణం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రారంభమైనందును ముందు ఆ పార్టీవారు దూకితే తాము తర్వాత దూకుతామని ఆయన అన్నారు. బతికుండి ఏదైనా చేయాలని అనాలి గానీ కట్ట కట్టుకుని చావండి అని అనడమేమిటని ఆయన అడిగారు. నోరుంది కదా అని పారేసుకోవడం మంచిది కాదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ నాగం జనార్దన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. సంయమనం పాటించడం మంచిదని ఆయన జనార్దన్ రెడ్డికి సలహా ఇచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X