నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఈర్ష్యాద్వేశాలు వద్దు: వైయస్ సూచన

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్: ప్రజలకు సేవ చేసే విషయంలో ఈర్ష్యాద్వేషాలకు లోను కావద్దని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి జిల్లా కలెక్టర్లకు సూచించారు. రెండు రోజుల జిల్లా కలెక్టర్ల సమావేశాల సందర్భంగా ఆయన శనివారం జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధీ హామీ పథకం వంటి పలు పథకాలపై ఆయన కలెక్టర్లతో మాట్లాడారు.

కేంద్ర నిధులతో నిజామాబాద్, మహబూబ్ నగర్, ఉభయ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, ప్రకాశం, కర్నూలు, మెదక్ జిల్లాల్లో మోడల్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఎస్టీ,ఎస్సీ, బిసి, మైనారిటీ విద్యార్థులకు పావలా వడ్డీకే కార్పోరేషన్ల ద్వారా రుణ సౌకర్యం కల్సిస్తామని ఆయన చెప్పారు. ఎస్సీ, ఎస్టీ ఇందిరమ్మ గృహాలకు మరో 20 వేల రూపాయలేసి ఇచ్చి వాటి నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X