వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నల్లగొండ కోర్టులో ఆత్మహత్యా యత్నం
నల్లగొండ: నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టులో హత్య కేసులో దోషి సోమవారం ఉదయం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. 2003లో తన వద్ద పనిచేస్తున్న జానకీరాములును హత్య చేశాడనే ఆరోపణతో రామారావు అనే వ్యక్తి అరెస్టయ్యాడు. విచారణలో అతను హత్యకు పాల్పడినట్లు రుజువైంది. దీంతో కోర్టు అతనికి యావజ్జీవ ఖైదు వేసింది. ఈ కారణంగా అతను ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు.
Comments
Story first published: Monday, June 29, 2009, 12:30 [IST]