సిటీలో విద్యార్థిపై దారుణ ర్యాగింగ్
హైదరాబాద్: హైదరాబాదులోని ఒక ప్రైవేట్ కళాశాలలో ర్యాగింగ్ భూతం పడగ విప్పింది. సీనియర్ విద్యార్థులు ఒక విద్యార్థి గోళ్లు పీకేశారు. అంతే కాకుండా బ్లేడుతో చేతిని కోశారు. నా చావుకు ఎవరూ బాధ్యులు కారంటూ ఆ విద్యార్థి చేత స్యూసైడ్ నోట్ కూడా రాయించుకున్నారు. జూనియర్లతో తిరిగినందుకే సీనియర్లు ఈ ర్యాగింగ్ కు పాల్పడినట్లు తెలుస్తోంది.
ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న శ్రవణ్ అనే విద్యార్థి కూకట్ పల్లిలోని కళాశాల నుంచి మరో కళాశాలకు మారాడు. ఈ కొత్త కళాశాలలో అదే తరగతికి చెందిన పాత విద్యార్థులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. జూనియర్లతో తిరగకూడదని హెచ్చరిస్తూ తనపై ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. గదిలో వేసి గంటల పాటు వేధించారు.
Comments
Story first published: Thursday, July 2, 2009, 15:30 [IST]