వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షైనీ పిటిషన్ పై విచారణ వాయిదా

By Staff
|
Google Oneindia TeluguNews

Shiney Ahuja
ముంబై: పని మనిషిపై అత్యాచారాని పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కుంటున్న బాలీవుడ్ నటుడు షైనీ అహుజా పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణను స్థానిక సెషన్స్ కోర్టు జులై 7వ తేదీకి వాయిదా వేసింది. షైనీ జ్యుడిషియల్ కస్టడీని స్థానిక కోర్టు గురువారం ఈ నెల 16వ తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. తన ఆరోగ్యం బాగా లేదని అహుజా గురువారం కోర్టుకు తెలిపారు.

అహుజా తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని పని మనిషి ఆరోపించడంతో పోలీసులు ఆయనను జూన్ 15వ తేదీన అరెస్టు చేశారు. ఆయన భార్య ఆ ఆరోపణలు ఖండించినప్పటికీ వివిధ వైద్య పరీక్షల్లో అహుజా అత్యాచారానికి పాల్పడినట్లు తేలింది. దీంతో అహుజా తప్పించుకోవడానికి వీలు లేకుండా పోయింది. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేసి తీర్పు త్వరగా వెలువడేలా చూస్తామని ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఇటీవల చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X