రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి
చిత్తూరు:చిత్తూరు జిల్లాలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. ఈ ప్రమాదం జిల్లాలోని గంగవరం మండలం కల్లుపల్లి గ్రామం వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు.
పలమనేరు వెళుతున్న స్కూల్ ఆటోను లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో అక్కడ విషాద వాతావరణం నెలకొని ఉంది.
Comments
Story first published: Saturday, July 4, 2009, 10:28 [IST]