టిడిపి కుటుంబ పార్టీ: జెపి
విజయవాడ: ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని కార్యకర్తలు కాపాడుకుంటే చంద్రబాబు కుటుంబ ఆస్తిగా మార్చారని లోక్సత్తా అధినేత జయప్రకాశ్నారాయణ విమర్శించారు. అధికారం రాదనే నిరాశతో చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో ప్రచారానికి లోక్సత్తా పార్టీ రూ.3కోట్లు ఖర్చు చేసిందని, ఆడిట్ వివరాలను బహిర్గత పరిచినట్లు వెల్లడించారు. ఎన్నికల్లో డబ్బు పంపిణీకి తెలుగుదేశం పార్టీ తెరలేపిందన్నారు. సత్తా ఉంటే టిడిపి కూడా తన ఆడిట్ నివేదికను వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆరోపణలు చేసే ఏపార్టీ నాయకులైనా డబ్బులు పంపిణీచేయకుండా ఎన్నికల్లోపోటీ చేసి గెలుపొందాలని జేపీ సవాల్ విసిరారు.
Comments
Story first published: Sunday, July 5, 2009, 18:14 [IST]