దక్షిణాఫ్రికాలో అంధ్రుడు కిరణ్ మృతి
వరంగల్జిల్లా ఆరెపల్లి గ్రామానికి చెందిన బుద్దె శంకరయ్య, ఇందిరమ్మల కుమారుడు కిరణ్ దక్షిణాఫ్రికాలోని జొహెన్నెస్ బర్గ్ లో రెండేళ్లుగా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నారు. రెండు నెలల క్రితమే కిరణ్ ఆరెపల్లి వచ్చి పది రోజుల క్రితం మళ్లీ వెళ్లాడు. గత శనివారం రాత్రి అతనిపై దాడి జరిగినట్లు కిరణ్ స్నేహితులు వీరికి ఫోన్ లో వరంగల్ జిల్లాలోని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. విధులకు హాజరై తిరిగి వస్తుండగా దుండగులు అతనిపై కాల్పులు జరిపినట్లు చెప్పారు. రెండు బుల్లెట్లు కడుపులోకి పోవడంతో ఆసుపత్రికి తరలించామని, పరిస్థితి విషమంగా ఉందని సమాచారమిచ్చారు.
ఇటీవల కిరణ్ తాను గతంలో చేసిన కంపెనీలో పని మానేసి వేరే కంపెనీలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్లాడు. అక్కడ కిరణ్ ఒక్కడే ఎంపికయ్యాడు. ఇప్పటికే ఉద్యోగం ఉండి, మళ్లీ తమకు పోటీగా ఇంటర్వ్యూకు ఎందుకు వచ్చావంటూ ఓభారతీయుడు, మరో ముగ్గురు దక్షిణాఫ్రికా యువకులు అతనిపై దాడి చేసినట్లు తెలిసింది.