వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాక్సన్ అంతిమ వీడ్కోలుకు సిద్ధం

By Staff
|
Google Oneindia TeluguNews

Michael Jackson
లాస్‌ ఏంజిల్స్‌: పాప్‌ స్టార్ మైఖేల్‌ జాక్సన్‌ అంత్యక్రియలు మంగళవారం లాస్‌ ఏంజిల్స్‌లోని స్టెపుల్స్‌ సెంటర్‌ లో జరగనున్నాయి. మైఖేల్‌ మృతదేహాన్ని రూ.12.5 లక్షల ఖర్చుతో రూపొందించిన శవపేటికలో ఉంచి సమాధి చేయనున్నారు. ఈ అంత్యక్రియల్లో పాల్గొని చివరిసారిగా తమ అభిమాన పాప్‌ సింగర్‌ ను చూసేందుకు ఆన్‌ లైన్‌ లో సుమారు 1.6 మిలియన్‌ అభిమానులు టికెట్లు రిజర్వ్‌చేసుకున్నారు. అయితే లక్కీడ్రా ద్వారా ఇందులో 17,500 మందిని మాత్రమే ఎంపిక చేశారు. ఈ అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వహకులు టికెట్లు లేనిదే ఎవరిని అనుమంతించమని తెలిపారు. గుండెసంబంధిత వ్యాధితో జూన్‌ 25న మైఖెల్‌ జాక్సన్‌ మృతిచెందిన విషయం తెలిసిందే.

టికెట్లు లేని అభిమానులు టెలివిజన్ లో ఉదయం పది గంటలకు ప్రసారమయ్యే ప్రత్యక్ష ప్రసారాలు చూడాలని, ఇంట్లోని ఉండి టెలివిజన్ చూడండని లాస్ ఏంజెల్స్ పోలీసు శాఖ అసిస్టెంట్ చీఫ్ జిమ్ మెక్ డొనెల్ విజ్ఞప్తి చేశారు. ప్రపంచమంతటి నుంచీ అభిమానులు లాస్ ఏంజెల్స్ చేరుకుంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X