హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కిరణ్ ఫ్యామిలీకి 5 లక్షలు: వైయస్

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్: దక్షిణాఫ్రికాలో దుండగుల దాడిలో మరణించిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కిరణ్ కుటుంబానికి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించారు. కిరణ్ మృతదేహాన్ని రాష్ట్రానికి తెప్పించేందుకు అయ్యే ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని ఆయన చెప్పారు. దుండగులు జరిపిన కాల్పుల్లో వరంగల్ జిల్లాకు చెందిన కిరణ్ గాయపడి ఆ తర్వాత ఆస్పత్రిలో మరణించిన విషయం తెలిసిందే.

కిరణ్ మృత దేహాన్ని సాధ్యమైనంత త్వరగా రాష్ట్రానికి తెప్పించేందుకు చర్యలు తీసుకోవాలని అంతకు ముందు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు ప్రభుత్వాన్ని కోరారు. కిరణ్ కుటుంబ సభ్యులకు 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కిరణ్ మృతదేహాన్ని రాష్ట్రానికి తెప్పించేందుకు అవసరమైన ఖర్చులు ప్రభుత్వమే భరించాలని కూడా ఆయన కోరారు. విదేశాల్లోని తెలుగు విద్యార్థుల భద్రతపై దృష్టి సారించాలని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రభుత్వాన్ని కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X