హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆంధ్ర ఎంపీల నిరసనతో 5 రైళ్లు

By Staff
|
Google Oneindia TeluguNews

Mamata Banerjee
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు 5 కొత్త రైళ్లను మంజూరు చేస్తున్నట్లు రైల్వే మంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. ఇందులో ఒకటి హైదరాబాద్‌-ఢిల్లీ నాన్‌ స్టాప్‌ రైలు ఉంటుందని మిగతా నాలుగు రైళ్లను తరువాత ప్రకటిస్తామని మమత తెలిపారు. రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని గురువారంనాడు లోక్‌సభలో ఆంధ్ర పార్లమెంటు సభ్యులు నిరసన తెలిపారు. వారికి సమాధానం ఇస్తూ ఆమె ఈ సంగతి తెలిపారు. రాష్ట్రంలోని 15 రైల్వే స్టేషన్లను ఆదర్శ రైల్వేస్టేషన్లుగా మారుస్తామన్నారు. బడ్జెట్‌లో ప్రకటించిన సికింద్రాబాద్‌, తిరుపతి రైల్వే స్టేషన్లకు తోడు రాజమండ్రి, గుంటూరు రైల్వే స్టేషన్లను బహుళ ప్రయోజనాల సముదాయంగా తీర్చి దిద్దుతామన్నారు. ఏడాదిలోగా రాష్ట్రంలోని అన్ని మీటర్‌గేజ్‌ లైన్లను బ్రాడ్‌గేజ్‌గా మారుస్తామన్నారు.

రైల్వే బడ్జెట్‌పై గురువారం లోక్‌సభ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌ పార్లమెంటు సభ్యులు నిరసన గళం వినిపించారు. రైల్వే బడ్జెట్‌ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నిలదీశారు. ఇందుకు రైల్వే మంత్రి మమతా బెనర్జీ సమాధానం ఇస్తూ తాము ప్రత్యేకించి ఏ రాష్ట్రంపైనా వివక్ష చూపలేదని స్పష్టం చేశారు. ఉన్న పరిమితుల్లో న్యాయం చేశానని అన్నారు.రైల్వే బడ్జెట్ ను లోకసభ గురువారం ఆమోదించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X