హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ కు కిరణ్ మృతదేహం

By Staff
|
Google Oneindia TeluguNews

Kiran
హైదరాబాద్: దక్షిణాఫ్రికాలో దుండగుల కాల్పుల్లో మృతిచెందిన బుద్దె కిరణ్‌ మృతదేహం శనివారం హైదరాబాదుకు చేరుకుంది. శనివారమే ఆయన స్వగ్రామమైన వరంగల్‌ జిల్లా హన్మకొండ మండలం ఆరెపల్లి గ్రామానికి చేరనుంది. ఇదే రోజు అంత్యక్రియలు కూడా జరుగుతాయి. కిరణ్‌ మృతి చెందిన ఐదో రోజుకు మృతదేహం కుటుంబ సభ్యులకు చేరనుంది. జోహెన్నెస్‌ బర్గ్‌ విమానశ్రయంలో ఉన్న కిరణ్‌ మృతదేహాన్ని శుక్రవారం సాయంత్రం 5 గంటలకు కార్గో విమానంలో ఎక్కించారు.

కార్గో విమానం శనివారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ మేరకు కిరణ్‌ మృతదేహాన్ని ఆరెపల్లికి తీసుకొచ్చేందుకు ఎస్పీ సజ్జనార్‌ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇందుకు హసన్‌పర్తి ఎస్సై కె.జనార్దన్‌ రెడ్డి, కిరణ్‌ సోదరుడు బుద్దె గణేష్‌, మరో ఇద్దరు బంధువులు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌కు బయలుదేరారు. వీరు హైదరాబాద్‌ లో ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. వాహనాన్ని సైతం సమకూర్చారు. శంషాబాద్‌ నుంచి అంబులెన్స్‌లో మృతదేహాన్ని శనివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆరెపల్లి గ్రామానికి తీసుకొస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X