వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపిలో సంక్షోభం లేదు: జూ.ఎన్టీఆర్

By Staff
|
Google Oneindia TeluguNews

Jr Ntr
గుడివాడ: తెలుగుదేశం పార్టీలో సంక్షోభం లేనేలేదని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల అండదండలు, తాతగారు ఎన్టీఆర్‌ ఆశీస్సులు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీలో సంక్షోభం తలెత్తే ప్రసక్తే లేదని సినీనటుడు ఆయన అన్నారు. ఆదివారం కృష్ణాజిల్లా నిమ్మకూరు వచ్చిన ఆయన స్వర్గీయ ఎన్టీఆర్‌, బసవతారకంల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

తాత స్వర్గీయ ఎన్టీఆర్‌ దంపతుల ఆశీస్సులే తనకు పునర్జన్మను ప్రసాదించాయన్నారు. పార్టీలోకి వ్యక్తులు రావడం, పార్టీని వీడడం సంప్రదాయంగా సాగేవేనని తెలిపారు. దీన్ని సంక్షోభంగా భావించలేమన్నారు. తాను కార్యకర్తగానే పార్టీకి సేవలంది స్తానని చెప్పారు. ప్రస్తుతం సినిమాలపై దృష్టి కేంద్రీకరించానని, అయినప్పటికీ అన్న ఎన్టీఆర్‌ పేద ప్రజల కోసం స్థాపించిన టీడీపీ శ్రేయస్సును విస్మరించనని పేర్కొన్నారు. పార్టీలో యువతరం ప్రాతినిధ్యాన్ని పెంపొందించేందుకు అధిష్ఠానంతో చర్చిస్తానన్నారు.

పార్టీని వీడిన వాళ్లు తిరిగి తమ సొంత ఇంటికొచ్చే ప్రయత్నంలో ఉన్నారని జూనియర్‌ ఎన్టీఆర్‌ తెలిపారు. టీడీపీ అధికారంలో ఉన్నా, లేకపోయినా పేదల సంక్షేమాన్ని కోరుకుంటుందన్నారు. ఈ క్రమంలో పార్టీని వీడినవారు తిరిగి రావడం వలన ప్రజాసంక్షేమం దిశగా పార్టీ మరిన్ని కార్యక్రమాలు చేపట్టగలదని పేర్కొన్నారు. పదవులే ప్రాతిపదికగా వ్యవహరించే నాయకులు పార్టీని వీడినా పెద్దగా నష్టం ఉండబోదని, కార్యకర్తలే ఆ నేతల స్థానాన్ని భర్తీ చేస్తారని అన్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ వెంట ఎమ్మెల్యే కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్‌ తదితరులున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X