వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఒక కుటుంబం ఆత్మహత్య
గుంటూరు: దొంగతనం నేరం మోపారనే మనస్తాపంతో ఓ వ్యక్తి కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా అమృతలూరులోని ఎస్టీ కాలనీకి చెందిన ఎందేటి సాంబశివరావు మంగళగిరిలోని ఓ మద్యం దుకాణంలో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. అక్కడ జరిగిన ఓ దొంగతనం కేసులో యజమాని ఇతన్ని బాధ్యుడిని చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన సాంబశివరావు స్వగ్రామం అమృతలూరు వెళ్లి కూల్డ్రింకులో పురుగులమందు కలిపి తాను తాగి భార్య,ఇద్దరు పిల్లలకు తాగించాడు. దీంతో అంతా మృతి చెందారు.
Comments
Story first published: Tuesday, July 14, 2009, 16:12 [IST]