హైదరాబాద్‌: భారత స్టాక్‌ మార్కెట్‌ రెండోరోజు లాభాల్లో కొనసాగుతోంది. నిన్నటి ముగింపుకు నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. ప్రస్తుతం నిఫ్టీ 80 పాయింట్ల వృద్ధితో 4190 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 236 పాయింట్లు లాభపడింది. ఐడియా, డీఎల్‌ఎఫ్‌, ఆర్‌పవర్‌, భెల్‌, హీరోహోండా, టాటాస్టీల్‌, యూనిటెక్‌, సెయిల్‌, హిండాల్కో, సీమెన్స్‌ కంపెనీ షేర్లు లాభాలో కొనసాగుతున్నాయి. అంబుజాసిమెంట్‌, ఇన్ఫోసిస్‌, హిందుస్థాన్‌ యూనిలీవర్‌, సిప్లా నష్టాల్ని నమోదు చేసుకున్నాయి.