హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మర్యాద లేని పార్టీ టీడీపి..శోభారాణి

By Staff
|
Google Oneindia TeluguNews

Shobha Rani
హైదరాబాద్‌: కనీస మర్యాద కూడా లేని తెలుగుదేశం పార్టీతో కలిసి పని చేయలేమని మహిళారాజ్యం అధ్యక్షురాలు శోభారాణి అన్నారు. చాలా గ్యాప్ తర్వాత ఆమె పార్టీ కార్యాలయానికి వచ్చి మీడియాతో మాట్లాడారు. తమ ప్రజారాజ్యం పాలసీలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఏం పని అని ఆమె ప్రశ్నించారు. ప్రజారాజ్యం వల్ల ముప్పు ఉందని భావించే బాబు తమ పార్టీని టార్గెట్‌ చేస్తున్నారని, తాము పెరుగుతున్నామనడానికి ఇదే నిదర్శనమని ఆమె చెప్పారు.

ఇక వలసల గురించి ప్రస్తావించగా...వలసలు ఇతర పార్టీలలోనూ ఉన్నప్పటికీ మమ్మల్నే ఎందుకు అడుగుతున్నారంటూ ఎదురు ప్రశ్నించారు. సహనం లేని వారే ప్రజారాజ్యాన్ని వీడిపోతున్నారని వలసనేతలనుద్దేశించి అన్నారు. అయినా ప్రజలను కాపాడగలిగే శక్తి ఒక్క ప్రజారాజ్యానికి మాత్రమే ఉం. పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు నిరసనగా ఈ నెల 16న ఇందిరాపార్కు వద్ద నిర్వహించే ధర్నాకు అధినేత చిరంజీవి హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆమె పిలుపునిచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X