హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్ణాటకలో వైఎస్ కూతురి పవర్ ప్లాంట్

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్‌: కర్ణాటకలో ముఖ్యమంత్రి వైఎస్ కుటుంబానికి వ్యాపార ప్రయోజనాలున్నాయని, రోడ్డు బ్రిడ్జిల పేరిట అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్న 'కర్ణాటకం' అంతా వైఎస్‌ కు తెలిసే జరుగుతున్నదని టీడీపీ ధ్వజమెత్తింది. కృష్ణా నదిపై కర్ణాటక నిర్మిస్తున్న ఓ అక్రమ ప్రాజెక్టు వద్ద సీఎం కుమార్తెకు చెందిన హైడల్‌ ప్లాంటును నిర్మించడమే దీనికి సాక్ష్యమంది. మహబూబ్‌నగర్‌, నల్లగొండ, ఖమ్మం, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి 12మంది ఎమ్మెల్యేలు బుధవారం కర్ణాటక వెళ్లి...కృష్ణా, దాని ఉప నదులపై నిర్మించిన ఆరు అక్రమ ప్రాజెక్టులను పరిశీలించి వచ్చిన విషయం తెలిసిందే.

ఆ వివరాలను ఎమ్మెల్యేలు నాగం, మోత్కుపల్లి నర్సింహులు, పత్తిపాటి పుల్లారావు, రావుల చంద్రశేఖరరెడ్డి, దేవినేని ఉమ, సండ్ర వెంకటవీరయ్య, పి.రాములు, మహేందర్‌ రెడ్డి, జీవీ ఆంజనేయులు గురువారం టీడీఎల్పీలో విలేఖరులకు వివరించారు. కర్ణాటకలో కృష్ణానదిపై నిర్మించిన గూగల్‌ ప్రాజెక్టు వద్ద 'ఎస్‌ ఆర్‌ ఎస్‌ ఈపీఎల్‌' పేరిట ఓ జల విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మితమైందని, ఇది 'మీ ముఖ్యమంత్రిదే కదా' అని అక్కడ ఉన్నవారంతా చెప్పారని నాగం తెలిపారు. ఆ ప్లాంటు కోసం కృష్ణా ప్రవాహాన్నే మళ్లించారని విమర్శించారు. ఆ ప్లాంటుకు సంబంధించిన ఫొటోను, కర్ణాటక అక్రమ ప్రాజెక్టుల ఫొటోలను విలేఖరుల సమావేశంలో ప్రదర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X