కర్ణాటకలో వైఎస్ కూతురి పవర్ ప్లాంట్
ఆ వివరాలను ఎమ్మెల్యేలు నాగం, మోత్కుపల్లి నర్సింహులు, పత్తిపాటి పుల్లారావు, రావుల చంద్రశేఖరరెడ్డి, దేవినేని ఉమ, సండ్ర వెంకటవీరయ్య, పి.రాములు, మహేందర్ రెడ్డి, జీవీ ఆంజనేయులు గురువారం టీడీఎల్పీలో విలేఖరులకు వివరించారు. కర్ణాటకలో కృష్ణానదిపై నిర్మించిన గూగల్ ప్రాజెక్టు వద్ద 'ఎస్ ఆర్ ఎస్ ఈపీఎల్' పేరిట ఓ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మితమైందని, ఇది 'మీ ముఖ్యమంత్రిదే కదా' అని అక్కడ ఉన్నవారంతా చెప్పారని నాగం తెలిపారు. ఆ ప్లాంటు కోసం కృష్ణా ప్రవాహాన్నే మళ్లించారని విమర్శించారు. ఆ ప్లాంటుకు సంబంధించిన ఫొటోను, కర్ణాటక అక్రమ ప్రాజెక్టుల ఫొటోలను విలేఖరుల సమావేశంలో ప్రదర్శించారు.
Comments
Story first published: Friday, July 17, 2009, 9:49 [IST]