రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో పట్టపగలే ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బైక్ పై వెళుతుండగా హతుడిని కొందరు దుండగులు వెంటాడి చంపారు. అతికిరాతకంగా రాళ్లతో మోది హత్య చేశారు. ఈ ఘటన మలక్ పేటలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. హత్యకు గురైన వ్యక్తిని రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజుగా పోలీసులు గుర్తించారు. హతుడు సరూర్ నగర్ వాసని పోలీసులు తెలిపారు.
Comments
Story first published: Saturday, July 18, 2009, 15:34 [IST]