కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మీకు విడాకులిస్తా: వైఎస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
న్యూఢిల్లీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో సరిగ్గా పనిచేయకపోతే విడాకులిస్తానని కరీంనగర్‌ కాంగ్రెస్‌ నేతలను ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హెచ్చరించారు. బాబ్లీ ప్రాజెక్టుపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పి.కె.బన్సాల్‌ కు వినతిపత్రం ఇవ్వడానికి మాజీ స్పీకర్‌ సురేశ్‌ రెడ్డి నేతృత్వంలో వచ్చిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు శనివారం ఢిల్లీలో ఉన్న వైఎస్‌ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

అప్పుడు ఆయన కరీంనగర్‌ కు చెందిన దేవాదాయశాఖ మాజీ మంత్రి రత్నాకర్‌ రావుతో పాటు పలువురు నేతలతో మాట్లాడారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి శతవిధాలా కృషి చేయాలని లేకపోతే విడాకులిస్తానని చెప్పినట్లు తెలిసింది. అవసరమైతే ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన స్వతంత్ర అభ్యర్థులనైనా పార్టీలోకి చేర్చుకుంటామని, పనిచేసేవారిని ఎక్కువగా ప్రోత్సహిస్తామని కూడా వైఎస్‌ వారితో అన్నట్లు తెలిసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X