హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆంధ్రజ్యోతి ఎండికి కోర్టు వారంట్

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఆంధ్రజ్యోతి తెలుగు దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణపై మేడ్చల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు గురువారం నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. ఆంధ్రజ్యోతి అప్పటి సంపాదకుడు రామచంద్రమూర్తిపై కూడా కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. సీతాపతిరావుకు చిర్రెత్తుకొచ్చింది ఎందుకు అనే వార్తాకథనంపై రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి సలహాదారు సీతాపతిరావు ఆంధ్రజ్యోతి దినపత్రికపై పరువు నష్టం దావా వేశారు. దీంతో వీరిపై ఐపిసి 500, 501 సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. దీనిపై కోర్టు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ, అప్పటి సంపాదకులపై నాన్ బెయిలబుల్ వారంట్లు జారీ చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X