వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎల్టీటీఈ నేతగా పద్మనాథన్‌

By Staff
|
Google Oneindia TeluguNews

Pathmanathan
కొలంబో: తమ నూతన సారధిగా సెల్‌వరసా పద్మనాథన్‌ను నియమించినట్లు ఎల్టీటీఈ ప్రకటించింది. స్వతంత్ర తమిళ ఈలం సాధనే లక్ష్యంగా తమ యుద్ధం కొనసాగుతుందని ఎల్టీటీఈ ప్రకటించింది. కొత్త యుద్ధ తంత్రాలు, సరికొత్త వ్యూహాలతో తమ పోరాటాన్ని కొనసాగిస్తామని టైగర్లు ప్రతిన బూనారు. రెండు నెలల క్రితం ఎల్టీటీఈ అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్‌ను శ్రీలంక బలగాలు మట్టుపెట్టిన తర్వాత ఆయన వారసునిగా తమిళ పులలకు నాయకత్వం వహించే బాధ్యతను చేపట్టేందుకు పద్మనాథన్‌ను ఎంపిక చేసినట్లు టైగర్లు వెల్లడించారు. ఈ మేరకు ఎల్టీటీఈ ఎగ్జిక్యూటీవ్‌ కమిటీ పేరిట ఒక ప్రకటన వెలువడింది.

స్వతంత్ర తమిళ ఈలం సాధన దిశగా తమ దళాలను పద్మనాథన్‌ ముందుకు నడిపిస్తారని ఎల్టీటీఈ వర్గాలు ప్రకటించాయి. 54 ఏళ్ల వయసున్న పద్మనాథన్‌పై ఆయుధాల అక్రమ సరఫరాకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. 'మేము ఎంతగానో ప్రేమించే తమిళ ప్రజలు, అంతర్జాతీయ సమాజానికి సుపరిచితమైన పద్మనాథన్‌ను ఎల్టీటీఈ ఎగ్జిక్యూటీవ్‌ కమిటీ అభినందిస్తోంది. ఇక నుంచి ఆయనే మా స్వాతంత్య్ర పోరాటాన్ని ముందుకు నడిపిస్తారు' అని ఎల్టీటీఈ ఆ ప్రకటనలో పేర్కొంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X