వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎల్టీటీఈ నేతగా పద్మనాథన్
స్వతంత్ర తమిళ ఈలం సాధన దిశగా తమ దళాలను పద్మనాథన్ ముందుకు నడిపిస్తారని ఎల్టీటీఈ వర్గాలు ప్రకటించాయి. 54 ఏళ్ల వయసున్న పద్మనాథన్పై ఆయుధాల అక్రమ సరఫరాకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. 'మేము ఎంతగానో ప్రేమించే తమిళ ప్రజలు, అంతర్జాతీయ సమాజానికి సుపరిచితమైన పద్మనాథన్ను ఎల్టీటీఈ ఎగ్జిక్యూటీవ్ కమిటీ అభినందిస్తోంది. ఇక నుంచి ఆయనే మా స్వాతంత్య్ర పోరాటాన్ని ముందుకు నడిపిస్తారు' అని ఎల్టీటీఈ ఆ ప్రకటనలో పేర్కొంది.
Comments
Story first published: Thursday, July 23, 2009, 8:16 [IST]