నేడే అసెంబ్లీ బడ్జెట్
హైదరాబాద్ :2009-10 ఆర్థిక సంవత్సరానికి గానూ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజున స్పీకర్ అన్ని పార్టీల నేతలకు జూబ్లీహాల్లో అల్పాహార విందునిచ్చారు. ఈ విందుకు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి, పలువురు మంత్రులు, లోక్సత్తా అధినేత జయప్రకాష్నారయణ, ప్రరాపా, తెరాస, సీపీఐ, సీపీఎం, భాజపా, ఎంఐఎం నేతలు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి తెదేపా గైర్హాజరు అయింది. కొవ్వూరు ఎమ్మెల్యే అరెస్టుకు నిరసనగా అల్పాహార విందును తిరస్కరిస్తున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.
ఇత ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ఈ రోజే ఆర్ధికమంత్రి రోషయ్య ప్రవేశపెట్టనున్నారు. మొదట దీనని మంత్రిమండలి ఆమోదిస్తుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 12.30కు ఆర్థిక మంత్రి రోశయ్య శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెడుతారు. అటు మండలిలో రెవెన్యూ మంత్రి ధర్మానప్రసాదరావు వార్షిక బడ్జెట్ను సమర్పిస్తారు. ఈ సమావేశాల నుంచి అసెంబ్లీలోకి మీడియా, సందర్శకుల ప్రవేశాన్ని కుదిస్తున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఇతర ప్రత్యక్ష ప్రసారాలు నిషేధం. సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎలాంటి ప్రతినిధి బృందాలను ముఖ్యమంత్రి, మంత్రుల వద్దకు అనుమతించరు. ఫొటోపాస్లతో సందర్శకులను గ్యాలరీలోకి అనుమతిస్తారు.