వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేడే అసెంబ్లీ బడ్జెట్

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ :2009-10 ఆర్థిక సంవత్సరానికి గానూ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజున స్పీకర్‌ అన్ని పార్టీల నేతలకు జూబ్లీహాల్లో అల్పాహార విందునిచ్చారు. ఈ విందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, పలువురు మంత్రులు, లోక్‌సత్తా అధినేత జయప్రకాష్‌నారయణ, ప్రరాపా, తెరాస, సీపీఐ, సీపీఎం, భాజపా, ఎంఐఎం నేతలు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి తెదేపా గైర్హాజరు అయింది. కొవ్వూరు ఎమ్మెల్యే అరెస్టుకు నిరసనగా అల్పాహార విందును తిరస్కరిస్తున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.

ఇత ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఈ రోజే ఆర్ధికమంత్రి రోషయ్య ప్రవేశపెట్టనున్నారు. మొదట దీనని మంత్రిమండలి ఆమోదిస్తుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 12.30కు ఆర్థిక మంత్రి రోశయ్య శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతారు. అటు మండలిలో రెవెన్యూ మంత్రి ధర్మానప్రసాదరావు వార్షిక బడ్జెట్‌ను సమర్పిస్తారు. ఈ సమావేశాల నుంచి అసెంబ్లీలోకి మీడియా, సందర్శకుల ప్రవేశాన్ని కుదిస్తున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఇతర ప్రత్యక్ష ప్రసారాలు నిషేధం. సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎలాంటి ప్రతినిధి బృందాలను ముఖ్యమంత్రి, మంత్రుల వద్దకు అనుమతించరు. ఫొటోపాస్‌లతో సందర్శకులను గ్యాలరీలోకి అనుమతిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X