హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ధరలపై ఆందోళన: అసెంబ్లీ స్తంభన

By Staff
|
Google Oneindia TeluguNews

Assembly
హైదరాబాద్: నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలపై సోమవారం కాసేపు శాసనసభా కార్యక్రమాలు స్తంభించాయి. నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలపై సభ సమావేశం కాగానే తక్షణ చర్చకు ప్రతిపక్షాలు వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించాయి. ఆ తీర్మానాన్ని స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి తిరస్కరించారు. తెలుగుదేశం శాసనసభ్యులు ప్లకార్డులు ప్రదర్సిస్తూ నించున్నారు. చర్చ జరగాల్సిందేనని వారు పట్టుబట్టారు. అయినా స్పీకర్ అనుమతించలేదు.

సభా సలహా సంప్రదింపుల కమిటీ (బిఎసి) నిర్ణయం మేరకు వ్యవహరించాలని స్పీకర్ సూచించారు. బడ్జెట్ పై చర్చలో నిత్యావసర సరుకల ధరలపై మాట్లాడవచ్చునని, ధరల పెరుగుదలపై చర్చ జరగాల్సిందేనని, అయితే బిఎసిలో జరిగిన చర్చకు వ్యవహరిద్దామని స్పీకర్ అన్నారు. అయినా ప్రతిపక్షాల సభ్యులు వినలేదు. చాలాసేపటికి గాని ప్రతిపక్షాలు సద్దు మణగలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X