ఇంటర్ విద్యార్థి అనుమానాస్పద మృతి
విజయవాడ: విజయవాడలో ఇంటర్మీడియట్ విద్యార్థి నాగ చైతన్య అనుమానాస్పద స్థితిలో మరణించాడు. రాత్రి ఒంటిగంటన్నర ప్రాంతంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. విజయవాడలోని శారదా క్యాంపస్ లోని ఐదో అంతస్థులో నాగ చైతన్య సగం కాలిన మృత దేహం కనిపించింది. ఈ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది హత్యనా, ఆత్మహత్యానా ఆనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నాగ చైతన్య పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలుకు చెందినవాడు. శ్రీచైతన్య కళాశాలలో బైపిసి మొదటి సంవత్సరం చదువుతున్నాడు. నాగ చైతన్య విజయవాడకు చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. నాగ చైతన్య మృతికి కారణాలు తెలియవని, తరగతిలో నెమ్మదిగా ఉండేవాడని, అడిగిన ప్రతిదానికి సమాధానం ఇచ్చేవాడని కళాశాల ప్రిన్సిపాల్ అంటున్నాడు. ఇటీవల ఓ విద్యార్థి ఇదే క్యాంపస్ లోని నాలుగో అంతస్థు నుంచి కిందికి దూకాడు. తీవ్రంగా గాయపడిన అతను ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.