హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాములమ్మ చెప్పాల్సిందే: నాయని

By Staff
|
Google Oneindia TeluguNews

Vijayashanthi
హైదరాబాద్: కాంగ్రెసులో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు విజయశాంతి సమాధానం చెప్పాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు నాయని నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాతనే విజయశాంతి వేరే పార్టీలోకి వెళ్లాలని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. విజయశాంతి తీరుపై ఆయన తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

కాగా, విజయశాంతి గురువారం కాంగ్రెసు శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డితో సమావేశమైనట్లు తెలుస్తోంది. తాను కాంగ్రెసులో చేరే విషయమై ఆమె జగ్గారెడ్డితో మాట్లాడినట్లు చెబుతున్నారు. విజయశాంతి తన సొంత బలంతోనే మెదక్ లోకసభ స్థానం నుంచి గెలుపొందారని తూర్పూ జయప్రకాష్ రెడ్డి బుధవారంనాడు అన్నారు. తూర్పు జయప్రకాష్ రెడ్డి నివాసంలో గురువారం విజయశాంతి మరింత మంది నాయకులతో కూడా సమావేశమైనట్లు చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X