అంతా 'మగధీర' హంగామా
కాగా, రాష్ట్రంలో అంతటా మగధీర సందడే. థియేటర్ల వద్ద టికెట్ల కోసం అభిమానులు ఆందోళనలకు దిగుతున్నారు. విశాఖపట్నం జిల్లా గాజువాకలో మోహినీ థియేటర్ పై రామచరణ్ అభిమానులు దాడులు చేశారు. అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది. శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటలకు టికెట్లు ఇస్తామని థియేటర్ యాజమాన్యం చెప్పడంతో పెద్ద యెత్తున అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా విధ్వంసం చోటు చేసుకుంది. మెహినీ థియేటర్ లోకి ప్రవేశించి అభిమానులు విధ్వంసం సృష్టించారు. ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తల సందడి కూడా దానికి తొడైంది.
మగధీర సినిమాను హాలీవుడ్ స్థాయిలో నిర్మించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది పునర్జన కథాంశం మీద ఆధారపడి నిర్మించినట్లు చెబుతున్నారు. కత్తి యుద్ధాలు తదితర భీకర సన్నివేశాలున్నాయని అంటున్నారు. 18 ఏళ్ల లోపువారికి థియేటర్ల యజమానులు టికెట్లు ఇవ్వడం లేదు. దీంతో సినిమాలో సన్నివేశాలపై మరింత ఉత్సుకత చెలరేగుతోంది.