చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోడ్డు ప్రమాదాల్లో 3గురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

Road Accident
హైదరాబాద్: రాష్ట్రంలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో శనివారం ఉదయం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మరణించారు. పలువురు గాయపడ్డారు. గుంటూరు జిల్లా మంగళగిరి జాతీయ రహదారిపై శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించగా, ఎనిమిది మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. లారీ - ఆర్టీసి బస్సులు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.

మెదక్ జిల్లా సదాశివపేటలో లారీ - ఆటో ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మృతులు రంగారెడ్డి జిల్లాకు చెందినవారని తెలుస్తోంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కోదండాపురం వద్ద లారీ బస్సును ఢీకొట్టడంతో పది మంది గాయపడ్డారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X