వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిర్ లైన్స్ బెయిల్ అవుట్ కు నో

By Staff
|
Google Oneindia TeluguNews

Praful Patel
న్యూఢిల్లీ: ప్రైవేట్ ఎయిర్ లైన్స్ బెయిల్ అవుట్ ప్రకటించడానికి ప్రభుత్వం నిరాకరించింది. పౌర విమాన యానాల మంత్రి ప్రఫుల్ పటేల్ శనివారం ఈ విషయం చెప్పారు. తమకు ప్రభుత్వం సహాయం అందించకపోతే ఈ నెల 18వ తేదీన విమానా సర్వీసులను నిలిపేస్తామని ప్రైవేట్ ఎయిర్ లైన్స్ ఒక్కటై ప్రకటించాయి. ఈ స్థితిలో ప్రఫుల్ పటేల్ ఆ ప్రకటన చేశారు. ఈ నెల 18వ తేదీ సమ్మెను విరమించుకోవాలని ప్రఫుల్ పటేల్ ప్రైవేట్ విమాన యాన సంస్థల యజమానులకు సూచించారు.

ప్రయాణికుల ప్రయోజనాలను కాపాడాల్సి ఉంటుందని, అవసరమైతే డిజిసిఎ చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను పెంచుతుందని ఆయన చెప్పారు. పారామౌంట్ కూడా సమ్మెలో చేరుతుందా, లేదా అనేది తెలియదని ఆయన అన్నారు.

జెట్ ఇంధనంపై పన్నును, విమానాశ్రయాల చార్జీలను తగ్గించి తమకు సహాయం చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తే తప్ప తమకు మనుగడ ఉండదని పరిశ్రమ లాబీ ఇండియన్ ఎయిర్ లైన్స్ సమాఖ్య అభిప్రాయపడింది. జెట్ ఎయిర్ వేస్, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్, స్పైస్ జెట్, ఇండిగో, గోఎయిర్ ఈ సమ్మెకు పూనుకున్నాయి. ఈ సంస్థలు నడిపే విమానాల ద్వారా రోజుకు దాదాపు లక్ష మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు వెళ్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X