తెరాసకు మరో నేత గుడ్ బై
తెరాస అసమ్మతి నాయకులకు ఒక ఉమ్మడి వేదిక లేకుండా పోయింది. కొంత మంది కాంగ్రెసు వైపు వెళ్లడానికి సిద్ధపడుతుండగా, మరి కొంత మంది తెలుగుదేశం వైపు చూస్తున్నారు. జిట్టా బాలకృష్ణారెడ్డి, కెకె మహేందర్ రెడ్డి, యెన్నం శ్రీనివాస రెడ్డి, నీల పద్మ వంటి నాయకులు ఈ నెల 3వ తేదీన కాంగ్రెసులో చేరే అవకాశం ఉంది. కాగా, మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి అధికారికంగా కాంగ్రెసులో చేరబోరని, ఆ పార్టీతో చెలిమి చేస్తారని అంటున్నారు. రాములమ్మపై చర్య తీసుకునే విషయంపై చర్చించడానికి శనివారం మధ్యాహ్నం తెరాస పోలిట్ బ్యూరో సమావేశం కానుంది.
Comments
Story first published: Saturday, August 1, 2009, 12:16 [IST]