హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెరాసకు మరో నేత గుడ్ బై

By Staff
|
Google Oneindia TeluguNews

Vijayashanthi
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నుంచి మరో నాయకుడు అసమ్మతి శిబిరంలో చేరిపోయారు. శుక్రవారం నవాజ్ రెడ్డి అనే నాయకుడు అసమ్మతి శిబిరంలో చేరిపోగా తాజాగా శనివారం మాజీ ఐజి, పార్టీ ఉపాధ్యక్షుడు పోరెడ్డి చంద్రశేఖర రెడ్డి వంతు వచ్చింది. పోరెడ్డి చంద్రశేఖర రెడ్డి ఇటీవల జరిగిన ఎన్నికల్లో నల్లగొండ జిల్లా సూర్యాపేట నుంచి శాసనసభకు పోటీ చేసి ఓడిపోయారు. ఆయన అసమ్మతి నేత రెహ్మాన్ నివాసంలో ఆయనతో సమావేశం కానున్నారు.

తెరాస అసమ్మతి నాయకులకు ఒక ఉమ్మడి వేదిక లేకుండా పోయింది. కొంత మంది కాంగ్రెసు వైపు వెళ్లడానికి సిద్ధపడుతుండగా, మరి కొంత మంది తెలుగుదేశం వైపు చూస్తున్నారు. జిట్టా బాలకృష్ణారెడ్డి, కెకె మహేందర్ రెడ్డి, యెన్నం శ్రీనివాస రెడ్డి, నీల పద్మ వంటి నాయకులు ఈ నెల 3వ తేదీన కాంగ్రెసులో చేరే అవకాశం ఉంది. కాగా, మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి అధికారికంగా కాంగ్రెసులో చేరబోరని, ఆ పార్టీతో చెలిమి చేస్తారని అంటున్నారు. రాములమ్మపై చర్య తీసుకునే విషయంపై చర్చించడానికి శనివారం మధ్యాహ్నం తెరాస పోలిట్ బ్యూరో సమావేశం కానుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X