హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాములమ్మకు అవమానాలు: నరేంద్ర

By Staff
|
Google Oneindia TeluguNews

Vijayashanthi
హైదరాబాద్: విజయశాంతి మెదక్‌ ఎంపీగా ఎన్నికయ్యాక తాను మొదటిసారి కలిశానని, ఆమె టీఆర్‌ఎస్‌ లో కొనసాగే పరిస్థితులు కనిపించటంలేదని మాజీ పార్లమెంటు సభ్యుడు ఎ.నరేంద్ర అన్నారు. ఆమెకు పార్టీలో అనేక అవమానాలు ఎదురవుతున్నాయని, టీఆర్‌ ఎస్‌ లో ఉన్నప్పుడు ఇటువంటి బాధలు మేమూ పడ్డామని, ఏ పార్టీలోకి వెళ్లాలో ఆమే నిర్ణయించుకుంటుందని, అది తాను చెప్పలేనని నరేంద్ర అన్నారు. విజయశాంతితో కాంగ్రెస్‌ నాయకులు ఆలె నరేంద్ర, ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ శుక్రవారం భేటీ అయ్యారు. టీఆర్‌ఎస్‌కు దూరం కావాలని తీసుకున్న నిర్ణయం మంచిదేని విజయశాంతితో నరేంద్ర అన్నట్లు సమాచారం. కేసీఆర్‌ పార్టీలో ఎవరినీ ఎదగనివ్వరని ఆయన అన్నట్లు తెలుస్తోంది.

కేసీఆర్‌ వల్ల విజయశాంతి మానసిక ఒత్తిడికి గురవుతున్నారని జగ్గారెడ్డి తెలిపారు. "తెలంగాణలో అసలైన ఛీటర్‌ కేసీఆరే. కుటుంబ సభ్యుల కోసమే ఆయన తెలంగాణ వాదాన్ని ఎత్తుకున్నారు. హరీశ్‌, తనయుడు తారక రామారావు సీఎం వైఎస్‌ను కలిస్తే తప్పులేదు. అప్పుడు వారిని ఏమీ అనలేదు. కానీ, విజయశాంతి సీఎంను కలిస్తేనే తప్పు వచ్చిందా? మేమూ ఇలాగే టీఆర్‌ఎస్‌లో అవమానాలు పడ్డాం" అని తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X