హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

8 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్

By Staff
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: నియమాలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి 8 మంది తెలుగుదేశం సభ్యులను రెండు గంటలపాటు సోమవారం సభ నుంచి సస్పెండ్ చేశారు. ప్రతిపక్షాల విజ్జప్తి మేరకు తర్వాత వారి సస్పెన్షన్ ను ఎత్తేశారు. మెట్రో రైలు ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా వాకౌట్ చేసిన సభ్యులు తిరిగి సభ్యులు సభలోకి వచ్చారు. చర్చ ముగియడానికి ముందే సభ్యులు సభలోకి వచ్చారని ఆరోపిస్తూ వారిని సస్పెండ్ చేశారు. శాసనసభా వ్యవహారాల మంత్రి కె. రోశయ్య వారి సస్పెన్షన్ కు తీర్మానం ప్రతిపాదించారు.

సభ్యులు సస్పెండ్ అయిన తర్వాత బయటకు వెళ్లలేదు. దీంతో వారిని మార్షల్స్ చేత బయటికి గెంటేశారు. గాలి ముద్దు కృష్ణమ నాయుడు, నాగం జనార్దన్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, రమణ, నరేంద్ర, అమర్నాథ్, పయ్యావుల కేశవ్ సస్పెండ్ అయినవారిలో ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X