హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హోం నివేదికపై కమిషన్ అసంతృప్తి

By Staff
|
Google Oneindia TeluguNews

Assembly
హైదరాబాద్: ఢిల్లీలో అనుమానాస్పద స్థితిలో మరణించిన సాయుధ కానిస్టేబుల్ మురళీనాథ్ వ్యవహారంపై హోం శాఖ సమర్పించిన నివేదికపై మానవ హక్కుల కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. మురళీనాథ్ మృతిపై హోంశాఖ బుధవారం తన నివేదికను సమర్పించింది. మురళీనాథ్ మృతిపై విచారణ జరిపించాలని కోరుతూ ఆయన కుటుంబ సభ్యులు మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. దీంతో హోం శాఖ తన నివేదికను సమర్పించింది.

నివేదిక సమగ్రంగా లేదని మానవ హక్కుల కమిషన్ అభిప్రాయపడింది. కమిషన్ ముందు అదనపు ఐజి వివేక్ దూబే హాజరయ్యారు. దూబే కూతురు రక్షణ కోసం మురళీనాథ్ ను ఢిల్లీలో నియోగించారు. అక్కడే ఆయన మృతి చెందారు. కేసు విచారణను మానవ హక్కుల కమిషన్ ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X