హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎల్బీ నగర్ పిఎస్ లో లాకప్ డెత్?

By Staff
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని ఎల్బీ నగర్ పోలీసు స్టేషన్ లో ఎటిఎం చోరీ నిందితుడు జనార్దన్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. దీంతో అతని బంధువులు ఆందోళనకు దిగారు. ఎటిఎం చోరీ కేసులో జనార్దన్ తో పాటు సుధాకర్ అనే వ్యక్తి కూడా అరెస్టయ్యాడు. వారిద్దరిని మంగళవారం రాత్రి బ్లూసీ హోటల్ కు తీసికెళ్లినట్లు, తిరిగి వస్తుండగా టీ తాగే సమయంలో గుండె నొప్పి వస్తోందని జనార్దన్ చెప్పాడని, దాంతో వెంటనే దగ్గరలోని గాంధీ ఆస్పత్రిలో చేర్చామని, గాంధీ అస్పత్రిలో అతను మరణించాడని పోలీసులు అంటున్నారు.

పోలీసుల వాదనతో జనార్దన్ బంధువులు విభేదిస్తున్నారు. తీవ్రంగా కొట్టడంవల్లనే జనార్దన్ మరణించాడని వారంటున్నారు. జనార్దన్ తప్పు అంగీకరించాడని, అందువల్ల కొట్టాల్సిన అవసరం కూడా తమకు లేదని పోలీసులంటున్నారు. కాగా, జనార్దన్ తో పాటు ఉన్న సుధాకర్ ను లాకప్ లో వేశారు. సుధాకర్ చేత పోలీసులు ఏం జరిగిందనే విషయం చెప్పించి ఉంటే అనుమానాలు నివృత్తి అయి ఉండేవని వాదన వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే, జనార్దన్ మృతదేహానికి పోస్టు మార్టం జరుగుతోంది. జనార్దన్ పోలీసుల దెబ్బల వల్లనే మరణించాడని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇస్తున్నారు. సుధాకర్, జనార్దన్ గతంలో కూడా నేరాలు చేసి చాదర్ ఘాట్ పోలీసు స్టేషన్ నుంచి బెయిల్ పై విడుదలయ్యారు. ఆ తర్వాత సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తూ ఎటిఎం నేరాలు మొదలు పెట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X