వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఖాట్మండ్ ఆరుగురు ఎన్నారైల మృతి
బీహార్ కు చెందిన ఆ ఏడుగురు వ్యక్తులు ఖాట్మండులో ఉంటున్నారు. 15 ఏళ్ల బాలుడి వైద్య పరీక్షల నిమిత్తం వారు ఆస్పత్రికి వెళ్లి తిరిగి వస్తుండగా మృత్యువు కాటేసింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దీపక్ గుప్తా బీర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుల్లో ఐదుగురిని గుర్తించారు.
మృతుల్లో ధర్మనాథ్ సిన్హా (50), కృష్ణాదేవి (40), మదన్ గుప్తా (29), సంజీవ్ గుప్తా (15), బీనా సింగ్ (40) ఉన్నారు. బీనా సింగ్ మోతిహరికి చెందినవాడు కాగా మిగతా వారు సీతామర్హికి చెందినవారు. గాయపడిన దీపక్ గుప్తా కూడా సీతామర్హికి చెందినవాడే. మృతుల్లో 18 ఏళ్ల యువకుడిని గుర్తించాల్సి ఉంది. కారులో డ్రైవర్ సహా ముగ్గురు వ్యక్తులు పారిపోయారు. పోలీసులు కారును స్వాధీనం చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.
Comments
Story first published: Wednesday, August 5, 2009, 10:40 [IST]