వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఖాట్మండ్ ఆరుగురు ఎన్నారైల మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

Kathmandu
ఖాట్మండ్: వేగంగా వస్తున్న కారు ఢీకొట్టడంతో నేపాల్ రాజధాని ఖాట్మండులో ఆరుగురు ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) మృతి చెందారు. ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పేవ్ మెంట్ పై నడుస్తున్న వారిపై నుంచి కారు బుధవారం ఉదయం కారు దూసుకెళ్లింది. ఏడుగురు వ్యక్తులు ఆస్పత్రి నుంచి తిరిగి వస్తుండగా బుధవారం తెల్లవారు జామున ఒంటి గంట ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు చెప్పారు.

బీహార్ కు చెందిన ఆ ఏడుగురు వ్యక్తులు ఖాట్మండులో ఉంటున్నారు. 15 ఏళ్ల బాలుడి వైద్య పరీక్షల నిమిత్తం వారు ఆస్పత్రికి వెళ్లి తిరిగి వస్తుండగా మృత్యువు కాటేసింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దీపక్ గుప్తా బీర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుల్లో ఐదుగురిని గుర్తించారు.

మృతుల్లో ధర్మనాథ్ సిన్హా (50), కృష్ణాదేవి (40), మదన్ గుప్తా (29), సంజీవ్ గుప్తా (15), బీనా సింగ్ (40) ఉన్నారు. బీనా సింగ్ మోతిహరికి చెందినవాడు కాగా మిగతా వారు సీతామర్హికి చెందినవారు. గాయపడిన దీపక్ గుప్తా కూడా సీతామర్హికి చెందినవాడే. మృతుల్లో 18 ఏళ్ల యువకుడిని గుర్తించాల్సి ఉంది. కారులో డ్రైవర్ సహా ముగ్గురు వ్యక్తులు పారిపోయారు. పోలీసులు కారును స్వాధీనం చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X