టిడిపి, బిజెపి, మజ్లీస్ వాకౌట్
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వస్తున్నందున రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. ప్రతిపక్షాలు వాకౌట్ చేసిన అనంతరం మాట్లాడారు. శాసనసభలో ఏదో విధంగా వేడి రాజేయాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు. ప్రభుత్వం మోసం చేసిందనే విమర్శను ఆయన ఖండించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్షా 28 వేల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, వీటిలో 40 వేల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, మిగతా ఇళ్లను త్వరలోనే నిర్మిస్తామని ఆయన వివరించారు.
Comments
Story first published: Wednesday, August 5, 2009, 10:26 [IST]