వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆకలితో ఎవరినీ చావనివ్వం: పిఎం

By Staff
|
Google Oneindia TeluguNews

Manmohan Reddy
న్యూఢిల్లీ: ఆకలి కారణంగా ఒక్క మరణం కూడా జరగకుండా చర్యలు తీసుకుంటామని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చెప్పారు. వర్షాభావ పరిస్థితుల వల్ల వ్యవసాయం తీవ్రంగా దెబ్బ తినే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఆయన ఆ విధంగా అన్నారు. కరువు, ధరల పెరుగుదలలపై ఆయన శనివారం రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల సమావేశంలో ఆయన శనివారం మాట్లాడారు. రాష్ట్రాలకు తగిన సాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

వర్షాభావ పరిస్థితుల వల్ల ఇప్పటి వరకు ఎనిమిదింటిని కరువు రాష్ట్రాలుగా ప్రకటించారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, పంజాబ్, ఛత్తీస్ ఘడ్, హర్యానా, జార్ఖండ్, అస్సాం రాష్ట్రాలను కరుపు ప్రాంతాలుగా ప్రకటించారు. మిగతా రాష్ట్రాల పరిస్థితి కూడా మెరుగ్గా ఏమీ లేదు. ఈ స్థితిలో వ్యవసాయ రంగం ఘోరంగా దెబ్బ తినే ప్రమాదం పొంచి ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X