శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తమ్మినేని రీఎంట్రీకి లైన్ క్లియర్

By Staff
|
Google Oneindia TeluguNews

Tammineni Sitaram
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ నేత తమ్మినేని సీతారాం తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరడానికి లైన్ క్లియర్ అయినట్లు సమాచారం. దీంతో ఆయన సోమవారం శ్రీకాకుళంలో ముఖ్యులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తాను తెలుగుదేశంలో చేరాలని అనుకోవడానికి గల కారణాలను ఆయన వివరించనున్నారు. కాగా, ఎల్లుండి ఆయన తన కార్యకర్తలతో సమావేశమవుతారు. ఆ తర్వాతే తెలుగుదేశం పార్టీలో చేరే విషయంపై ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ఆయన ఈ నెల 15న గానీ, 17వతేదీన గానీ తెలుగుదేశంలో చేరే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

కాగా, తమ్మినేని సీతారాం రీఎంట్రీని తెలుగుదేశం సీనియర్ నాయకుడు కె.ఎర్రంనాయుడు తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. అయితే పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నచ్చజెప్పడంతో ఆయన సుముఖంగా మారినట్లు చెబుతున్నారు. తమ్మినేని సీతారాంను తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని ఎర్రంనాయుడు సోమవారం చెప్పారు. పార్టీనుంచి వెళ్లిపోయే ముందు తనపై చేసిన విమర్శలకు తమ్మినేని నుంచి వివరణ అడగడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికైనా తమ్మినేని పార్టీలోకి తిరిగి రావడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X