వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ శవాలు మాకొద్దు: పాక్

By Staff
|
Google Oneindia TeluguNews

Mumbai Balsts
ఇస్లామాబాద్: ముంబై దాడుల సందర్భంగా మరణించిన ఉగ్రవాదుల మృతదేహాలను తీసికెళ్లడానికి పాకిస్తాన్ నిరాకరించింది. దాడుల సందర్భంగా మరణించిన తొమ్మిది మంది ఉగ్రవాదుల్లో నలుగురు పాకిస్తానీ జాతీయులని అంటూ వారి మృతదేహాలను తీసికెళ్లాలని మహారాష్ట్ర హోం మంత్రి పాకిస్తాన్ కోరారు. భారత మీడియాలో వచ్చిన వార్తలు అబద్ధమని పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం అధికార ప్రతినిధి అబ్దుల్ బాసిత్ ఇస్లామాబాదులోని ఆన్ లైన్ న్యూస్ ఏజెన్సీతో చెప్పారు.

భారత మీడియా వైఖరిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, పాక్, భారత ప్రధానులు ఇటీవలే సమావేశమైన నేపథ్యంలో ఇటువంటి నిరాధారమైన వార్తలు రావడం సరైంది కాదని ఆయన అన్నారు. పాకిస్తాన్, భారత్ ల మధ్య చర్చల ప్రక్రియకు విఘాతం కలిగించే వార్తలు రాయవద్దని ఆయన భారత మీడియాకు హితవు పలికారు. ముంబై దాడుల సందర్భంగా మరణించిన తొమ్మిది మంది ఉగ్రవాదుల్లో నలుగురు పాకిస్తాన్ వారని పాకిస్తాన్ అంగీకరించినట్లు మహారాష్ట్ర హోం మంత్రి జయంత్ పాటిల్ సోమవారం చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X