వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఛత్తీస్ ఘడ్ లో 6గురు మావోల హతం

By Staff
|
Google Oneindia TeluguNews

Maoists
రాయపూర్: భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఛత్తీస్ ఘడ్ లోని దంతెవాడ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మంగళవారం ఆరుగురు మవోయిస్టులు హతమయ్యారు. ఇరు వర్గాలకు మధ్య దాదాపు 20 గంటలపాటు ఎదురుకాల్పులు జరిగాయి. రాష్ట్ర రాజధాని రాయపూర్ కు 400 కిలోమీటర్ల దూరంలో గల దంతెవాడ జిల్లాలోని కిరందుల్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.

దంతెవాడ, బీజాపూర్ జిల్లాలకు చెందిన పోలీసు, పారా మిలిటరీ బలగాలు మావోయిస్టులతో తలపడ్డాయి. తమ సాయుధ పోలీసు బలగాల సాయంతో కేంద్ర రిజర్వ్ పోలీసు బలగాలు మావోయిస్టుల శిబిరంపై దాడి చేశాయి. దీంతో సోమవారం సాయంత్రం, మంగళవారం ఉదయం ఎదురు కాల్పులు జరిగాయని, ఆరుగురు నక్సలైట్లను హతం చేశామని, సంఘటనా స్థలం నుంచి నక్సలైట్ల ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని దంతెవాడ పోలీసు సూపరింటిండెంట్ అమ్రేష్ మిశ్రా చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X