హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసెంబ్లీ: టిడిపి ఎమ్మెల్యేల ధర్నా

By Staff
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: శాసనసభ నుంచి సస్పెండ్ అయిన తెలుగుదేశం సభ్యులు మంగళవారం స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి ఛాంబర్ ముందు ధర్నా చేశారు. వెన్నుపోటు కారణంగా సీనియర్ తెలుగుదేశం శాసనసభ్యుడు స్పీకర్ ఛేంబర్ ముందు పడుకుని నిరసన వ్యక్తం చేశారు. సస్పెండ్ అయిన శాసనసభ్యులు కొంత మంది సస్పెన్షన్ తర్వాత బయటకు వెళ్లకుండా స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో వారిని మార్షల్స్ చేత బయటకు పంపించారు. సస్పెండ్ అయిన టిడిపి సభ్యుడు రేవంత్ రెడ్డి సభలోకి వచ్చారు. దీంతో ఆయనను మార్షల్స్ తో బయటకు పంపించారు.

తెలుగుదేశం సభ్యుల సస్పెన్షన్ ను సిపిఐ, తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు నిరసించారు. సస్పెన్షన్షన్ ను ఎత్తివేయాలని వారు కోరారు. టిడిపి సభ్యులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సిపిఐ సభ్యుడు మల్లేష్ కోరారు. అయితే అందుకు స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి అంగీకరించలేదు. అందుకు నిరసనగా సిపిఐ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని టిడిపి సభ్యుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X