హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసెంబ్లీ: టిడిపి ఎమ్మెల్యేల సస్పెన్షన్

By Staff
|
Google Oneindia TeluguNews

Telugudesam
హైదరాబాద్: సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి తెలుగుదేశం శాసనసభ్యులను మంగళవారం ఒక్క రోజు పాటు సస్పెండ్ చేశారు. మొత్తం 44 మంది సభ్యులను స్పీకర్ సభ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన తర్వాత కొంత మంది తెలుగుదేశం సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో శాసనసభ టీవీ ప్రత్యక్ష ప్రసారాలు నిలిపేశారు. మీడియాపై విధించిన ఆంక్షలపై టిడిపి వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించింది. దాన్ని స్పీకర్ తిరస్కరించారు. అయితే చర్చ జరగాల్సిందేనని తెలుగుదేశం సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ ఎంతగా చెప్పిన వారు తమ పట్టు వీడలేదు. దీంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి.

తెలుగుదేశం సభ్యులు తమ పట్టు వీడకపోవడంతో శాసనసభా వ్యవహారాల మంత్రి కె.రోశయ్య మూడు రోజుల పాటు వారి సస్పెన్స్ కు తీర్మానాన్ని ప్రతిపాదించారు. అయితే వారిని ఒక్క రోజు పాటు మాత్రమే సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. బయటకు వెళ్లిపోవాల్సిందిగా ఆయన టిడిపి సభ్యులను ఆదేశించారు. అయితే కొంత మంది టిడిపి సభ్యులు బయటకు వెళ్లకుండా స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో టీవీ ప్రత్యక్ష ప్రసారాలు నిలిపేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X