హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మగధీరపై చిరుతో బొత్సా భేటీ

By Staff
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవితో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ భేటీ అయ్యారు. గురువారం ఉదయం శాసనసభ ఆవరణలోని ప్రజారాజ్యం శాసనసభా పక్షం కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. విజయనగరం జిల్లాలో చిరు తనయుడు రామ్ చరణ్ తేజ నటించిన మగధీర సినిమా నిషేధంపై వారిద్దరి మధ్య మంతనాలు జరిగినట్లు తెలుస్తోంది.

మగధీర సినిమా ప్రదర్శిస్తున్న సాలూరులోని థియేటర్లో ప్రమాదం సంభవించిన ఐదుగురు మరణించిన నేపథ్యంలో విజయనగరం జిల్లాలో మగధీర సినిమా ప్రదర్శనను నిలిపేయాలని మంత్రి బొత్సా సత్యనారాయణ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా, రవితేజ నటించిన ఆంజనేయులు సినిమాకు బొత్సా ఫైనాన్షియర్ కావడంతో ఆ సినిమా ప్రదర్శనకు అడ్డు రాకూడదనే ఉద్దేశంతో మగధీరను నిషేధించినట్లు వార్తలు వస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X