హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గన్ పార్కు వద్ద టిడిపి ధర్నా

By Staff
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: కరువు పరిస్థితులపై ప్రభుత్వ అలసత్వాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ వామపక్షాలతో కలిసి గురువారం ఉదయం శాసనసభ ఎదుట గల గన్ పార్కు వద్ద ధర్నా నిర్వహించింది. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున కరవు జిల్లాలను ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కరవు సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని విమర్శించింది.

శాసనసభలో కరపుపై చర్చను అడ్డుకోవడానికి తమ పార్టీ శాసనసభ్యులను తిట్టి వారిని సస్పెండ్ చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. రాష్ట్రంలో మంచినీరు, సాగునీరు, పశుగ్రాసం కొరత వల్ల రైతులు తీవ్ర ఇక్కట్ల పాలై రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. కరువు పరిస్థితులపై నివేదిక పంపాలని ప్రధాని మన్మోహన్ సింగ్ కోరారని, అయితే ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం స్పందించలేదని,త ఇది ప్రభుత్వ నిర్లిప్తతకు తార్కాణమని తెలుగుదేశం శాసనసభ్యుడు రావుల చంద్రశేఖర రెడ్డి అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X