హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహా ప్రాజెక్టులపై చర్యలు: పొన్నాల

By Staff
|
Google Oneindia TeluguNews

Ponnala Laxamaiah
హైదరాబాద్: మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై న్యాయ, రాజ్యాంగపరమైన చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర భారీ నీటి పారదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. మహారాష్ట్ర ప్రాజెక్టులపై మంత్రి సమాధానమివ్వాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో సోమవారం శాసనసభలో మంత్రి మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపడానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందు ఉంటుందని, ఈ విషయమై కేంద్ర జల సంఘంతో మాట్లాడుతున్నామని ఆయన చెప్పారు. 2004లో ఏర్పాటైన కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ ఎదుట మన రాష్ట్ర వాదనలను వినిపిస్తున్నామని, త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన విమర్శించారు.

మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టు సహా 12 అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోందని, వాటిని నిలువరించడంలో ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ అంతకు ముందు విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా పొరుగు రాష్ట్రాలు నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని సిపిఐ శాసనభ్యుడు గుండా మల్లేష్ అన్నారు. ప్రభుత్వం మంచినీటి ప్రాజెక్టులు మినహా ఇతర సాగు నీటి ప్రాజెక్టులపై శ్రద్ధ చూపడం లేదని ప్రతిపక్షాలు విమర్శించాయి.

అంతకు ముందు ప్రతిపక్షాలు ప్రతిపాదించిన వాయిదా తీర్మానాలను స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి తిరస్కరించారు. అయితే తాము ప్రతిపాదించిన తీర్మానాలై వెంటనే చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాతనే కరవుపై చర్చ జరుగుతుందని స్పీకర్ తేల్చి చెప్పారు. దాంతో ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X