హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసెంబ్లీ: బాబ్లీపై తెరాస వాకౌట్

By Staff
|
Google Oneindia TeluguNews

Etela Rajendar
హైదరాబాద్: మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ సహా అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాన్ని మన ప్రభుత్వం అడ్డుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నందుకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు సోమవారం సభ నుంచి వాకౌట్ చేశారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇచ్చిన సమాధానానికి తెరాస సభ్యులు సంతృప్తి చెందలేదు. మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టలపై తాము ఎంత చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెరాస శాససనభా పక్ష నేత ఈటెల రాజేందర్ విమర్శించారు. అందుకే తాము సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

అక్రమ ప్రాజెక్టులను అపించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యామ్నాయ చర్యల గురించి వివరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనిపై సభా సంఘాన్ని వేయాలని ఆయన డిమాండ్ చేశారు. మహారాష్ట్ర గోదావరిపై నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అపించడానికి న్యాయ, రాజ్యాంగపరమైన చర్యలు తీసుకుంటున్నామని అంతకు ముందు భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X