వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసుల అదుపులో ఎస్సై రంగనాథ్

By Staff
|
Google Oneindia TeluguNews

Guntur
గుంటూరు: ప్రేమ పేరుతో రజియా సుల్తానా అనే యువతిని మోసం చేశాడని ఆరోపణలు ఎదుర్కుంటున్న సబ్ ఇన్ స్సెక్టర్ (ఎస్సై) రంగనాథ్ గౌడ్ ప్రత్యేక పోలీసుల అదుపులో ఉన్నాడు. రేపల్లే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని బాపట్ల డిఎస్పీ ముందు ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. కొద్ది సేపట్లో అతన్ని కోర్టు ముందు హాజరు పరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రజియా సుల్తానా కేసులో ముందస్తు బెయిల్ కోసం రంగనాథ్ పెట్టుకున్న దరఖాస్తును హైకోర్టు సోమవారం తోసిపుచ్చింది. దీంతో రంగనాథ్ అరెస్టుకు మార్గం సుగమమైంది.

రజీయా సుల్తానా తనను బ్లాక్ మెయిల్ చేస్తుందంటూ చెబుతూ వచ్చిన రంగనాథ్ సోమవారం సాయంత్రం నుంచి మీడియాకు ముఖం చాటేస్తున్నాడు. మంగళవారం గుంటూరులోని సింధూరి హోటల్లో రంగనాథ్ ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లారు. మీడియా ప్రతినిధులను చూసి ఆయన గోడ దూకి పారిపోయాడు. ఎస్సైకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పొన్నూరు పోలీసు స్టేషను ముందు అతని మద్దతుదారులు ఆందోళనకు దిగారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X