హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కల్తీ కల్లుకు మరొకరు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

Illicit Liquor
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు శివారులో కల్తీ కల్లుకు మరో వ్యక్తి బలయ్యాడు. బాలానగర్ లో అబ్దుల్ అలీ అనే యువకుడు కల్తీ కల్లు సేవించి బుధవారం మరణించాడు. యువకుని మృతితో ఆగ్రహించిన ఇంద్రానగర్ బస్తీవాసులు మృతదేహంతో బాలానగర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.

హైదరాబాదు శివారులోని రాజేంద్ర నగర్ పరిధిలో మంగళవారం ఓ మహిళ మరణించిన విషయం తెలిసిందే. కల్తీ కల్లు సేవించిన పలు ప్రాంతాలకు చెందిన రాజేంద్రనగర్ పరిధిలోని స్థానికులు పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. కల్లు ఈ ప్రాంతానికి నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలనుంచి సరఫరా అవుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X